రాజదాని నిర్మాణం కోసం రాష్ట్ర సర్కార్ తలపెట్టిన లాండ్ పూలింగ్ రైతుల పాలిటి విష వృక్ష మయ్యింది .బలవంతంగా మావద్ద భూములు తీసుకుంది చంద్రబాబు సర్కార్ అని పెనుమాక , ఉండవల్లి ,నిడమర్రు రైతులు నిరాహార దీక్షలు చేసారు .
అయినా సర్కార్ దిగి రాలేదు .ఇక లాభం లేదని హైకోర్టుకు వెళ్ళారు .దీనిపై కోర్టు పూర్వాపరాలు పరిశీలించాక బలవంతపు లాండు పూలింగు ఎంతమాత్రం కుదరదు కనుక బలవంతంగా సర్కారు పుచ్చుకున్న పంట భూముల పత్రాలు తిరిగి ఇచ్చేయ వలసిందిగా కోర్టు ఆదేసించింది .రైతులు తాము ఇచ్చిన పత్రాలు తిరిగి తీసుకోవచ్చని కూడా తెలియచేసింది .దీనిపై రైతులు ఏడాదికి మూదు పంటలు ఇచ్చే పంటభూములు బలవంతంగా లాక్కున్నందుకే కోర్టుకు వెళ్ళాము అని రైతులు తరుపున వాదించే లాయర్ తెలిపారు .దీనిపై సర్కార్ హైకోర్టుకు లాండ్ పూలింగు లో రైతులు స్వచ్చందంగా ఇచ్చిన పత్రాలపై వివరణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది .