తమిళ హీరోలు బహుమతులు ఇవ్వడంలో ముందుంటారు.సినిమా సక్సెస్ అయినా, సినిమా షూటింగ్ పూర్తి అయినా సినిమాకు పని చేసిన వారికి, తమకు సహాయకులుగా పని చేసిన వారికి బహుమతులు ఇస్తూ వస్తుంటారు తమిళ హీరోలు.
ఇప్పటి వరకు రజినీకాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలు తమ సినిమాలకు పని చేసిన వారికి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ వచ్చారు.అయితే తాజాగా తమిళ హీరో విశాల్ ఏకంగా తన సినిమా కోసం పని చేసిన వారికి అందరికి బంగారం పంచి పెట్టి టాక్ ఆఫ్ ది తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యాడు.
ప్రస్తుతం విశాల్ ‘పాయుం పులి’ సినిమాలో నటిస్తున్నాడు.సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తి అయ్యింది.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులకు అందరికి దాదాపు 300 మందికి బంగారు నాణేలను విశాల్ స్వయంగా తన చేతులతో ఇచ్చాడు.తన సినిమా కోసం ఎంతో కష్ట పడ్డ వీరికి ఈ మాత్రం సాయం చేయడం చిన్న పని అంటూ చెప్పుకొచ్చాడు.
మరో వైపు త్వరలో తమిళ నటుల సంఘం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందరి దృష్టిలో పడేలా విశాల్ ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా కొందరు చెబుతున్నారు.ఏదైతే ఏం మొత్తానికి విశాల్ నుండి బహుమతి పొందిన వారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.