బంగారం పంచి పెట్టిన హీరో

తమిళ హీరోలు బహుమతులు ఇవ్వడంలో ముందుంటారు.సినిమా సక్సెస్‌ అయినా, సినిమా షూటింగ్‌ పూర్తి అయినా సినిమాకు పని చేసిన వారికి, తమకు సహాయకులుగా పని చేసిన వారికి బహుమతులు ఇస్తూ వస్తుంటారు తమిళ హీరోలు.

 Hero Vishal Gifts Gold Coins To Paayum Puli Film Unit-TeluguStop.com

ఇప్పటి వరకు రజినీకాంత్‌, అజిత్‌, విజయ్‌, సూర్య వంటి స్టార్‌ హీరోలు తమ సినిమాలకు పని చేసిన వారికి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ వచ్చారు.అయితే తాజాగా తమిళ హీరో విశాల్‌ ఏకంగా తన సినిమా కోసం పని చేసిన వారికి అందరికి బంగారం పంచి పెట్టి టాక్‌ ఆఫ్‌ ది తమిళ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అయ్యాడు.

ప్రస్తుతం విశాల్‌ ‘పాయుం పులి’ సినిమాలో నటిస్తున్నాడు.సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తి అయ్యింది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులకు అందరికి దాదాపు 300 మందికి బంగారు నాణేలను విశాల్‌ స్వయంగా తన చేతులతో ఇచ్చాడు.తన సినిమా కోసం ఎంతో కష్ట పడ్డ వీరికి ఈ మాత్రం సాయం చేయడం చిన్న పని అంటూ చెప్పుకొచ్చాడు.

మరో వైపు త్వరలో తమిళ నటుల సంఘం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందరి దృష్టిలో పడేలా విశాల్‌ ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా కొందరు చెబుతున్నారు.ఏదైతే ఏం మొత్తానికి విశాల్‌ నుండి బహుమతి పొందిన వారు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube