ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘పండుగ చేస్కో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.కొన్ని కారణాల వల్ల ‘పండుగ చేస్కో’ చిత్రం చాలా ఆలస్యం అయ్యింది.
ఎట్టకేలకు ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ఈయన తర్వాత చిత్రంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
‘పండుగ చేస్కో’ చిత్రానికి అయినట్లుగా తన తర్వాత చిత్రానికి లేట్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలని రామ్ భావిస్తున్నాడు.
కొత్త దర్శకుడు శ్రీనివాస్రెడ్డి దర్శకత్వంలో రామ్ నటిచబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఆ సినిమాకు ‘శివం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.
రామ్, శ్రీనివాస్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రానికి టైటిల్ ‘శివం’ కాదని, ఆ టైటిల్ మరో నిర్మాత చేతుల్లో ఉండటంతో ఈ చిత్రానికి ‘శివం శివోహం’ అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించినట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత స్రవంత రవికిషోర్ నిర్మించబోతున్నాడు.
‘పండుగ చేస్కో’ చిత్రంతో పాటు ‘శివం శివోహం’ చిత్రం కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా రామ్ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రామ్ ఈ రెండు చిత్రాలతో అయినా సక్సెస్లు అందుకుంటాడో చూడాలి.