ఎనర్జిటిక్ హీరో రామ్ ‘పండుగ చేస్కో’ సినిమాతో సక్సెస్ కొట్టి ఫుల్ జోష్తో ఉన్నాడు.ప్రస్తుతం ఈయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అందులో మొదటిది ‘శివం’ కాగా రెండవది ‘హరికథ’.ఈ రెండు సినిమాలు కూడా సమాంతరంగా చిత్రీకరణ జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా వైజాగ్లో జరిపేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.ఒకే రోజు ఈ రెండు సినిమాల షూటింగ్లో పాల్గొనబోతున్నాడు రామ్.
ఈ రెండు సినిమాలు సైతం స్రవంతి మూవీస్లో రవికిషోర్ నిర్మిస్తున్నందున ఒకే సారి రెండు సినిమాల చిత్రీకరణకు రామ్ సిద్దం అవుతున్నాడు.డే అండ్ నైట్ అనే తేడా లేకుండా వరుసగా ఈ రెండు సినిమాల్లో నటిస్తూ వైజాగ్లో బిజీ బిజీగా గడుపబోతున్నాడు రామ్.
ఇలా ఒకే సారి రెండు సినిమాల్లో నటించడం ఇప్పుడు చాలా అరుదు.అప్పట్లో సీనియర్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణలు ఒకే రోజులో రెండు మూడు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి.
అదే దారిలో రామ్ కూడా ఒకే సారి రెండు సినిమాలు చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు సైతం ఇదే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.