మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో అల్లు అరవింద్ నిర్మించబోతున్న సినిమా షూటింగ్ ఈనెల 26 నుండి ప్రారంభం కాబోతుంది.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమాకు నటీ నటులను ఎంపిక చేసే పనిలో దర్శకుడు బోయపాటి ఉన్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాలో ఒక యంగ్ విలన్ పాత్ర కోసం తమిళ హీరో, తెలుగు వాడు అయిన ఆది పినిశెట్టిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది.కథ, కథనం బాగా నచ్చడంతో పాటు, తన పాత్ర కూడా బాగా నచ్చడంతో వెంటనే ఆది ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తెలుగులో పలు సినిమా ద్వారా పరిచయం ఉన్న ఆది, తమిళంలో క్రేజీ హీరోగా ఉన్న సమయంలో ఇక్కడ విలన్గా నటించేందుకు ఒప్పుకుని సాహసం చేస్తున్నాడని కొందరు అంటున్నారు.మరి కొందరు మాత్రం తెలుగులో రాణించాలంటే ఇలాంటి ప్రయోగాలు, సాహసాలు తప్పవని అంటున్నారు.
బన్నీ మూవీలో విలన్గా సక్సెస్ను అందుకుంటే, తెలుగులో హీరోగా ఛాన్స్లు వచ్చే అవకాశాలున్నాయని ఆది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆది తెలుగులో ఇప్పటి వరకు ‘ఒక వి చిత్రం’ మరియు ‘గుండెల్లో గోదారి’ సినిమాల్లో నటించాడు.
రెండు సినిమాలు కూడా ఆదికి పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు.మరి విలన్ పాత్ర అయినా ఆదికి గుర్తింపును తెస్తుందో చూడాలి.