నిన్నటి తరం ప్రముఖ హీరోయిన్, ఎంపీ హేమమాలిని ప్రయాణిస్తున్న కారు ప్రమాదంకు గురైంది.ఈమె ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీ కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఆల్లో కారులో ఉన్న నాలుగు సంవత్సరాల చిన్నారి బాలికకు తీవ్రగాయాలయ్యి అక్కడికక్కడే చనిపోయింది.అదే కారులో ఉన్న మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇక హేమమాలిని కన్నుపై గాయం అయ్యింది.వెన్నెముఖకు బలంగా దెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు.
మధుర నుండి జైపూర్ వెళ్తున్న సమయంలో దౌసా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు దౌసాలోని ప్రముఖ హాస్పిటల్కు హేమమాలినితో పాటు గాయపడ్డ ఇతరులను కూడా తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి హేమమాలినికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు.ప్రస్తుతం హేమమాలిని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు.