చూడటానికి ఆకుపచ్చని రంగులో ఉండే పియర్ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా మోనోపాజ్ దాటిన మహిళలు తీసుకోవటం వలన గర్భకోశ సమస్యలు గుండె జబ్బులు అదుపులో ఉంటాయి.
అంతేకాకుండా అలర్జీ సమస్యలు ఉన్నవారు ఈ పండును తింటే మంచిది.ఎందుకంటే ఈ పండులో అలర్జీని అదుపు చేసే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
పియర్లో బీటా కెరోటిన్, సి విటమిన్, కె విటమిన్,పీచు, పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన అన్ని వయస్సుల వారు తినవచ్చు.
వయస్సు మీద పడిన వారు కూడా తినవచ్చు.
వారు ఈ పండును తినటం వలన అరుగుదల బాగుంటుంది.
పియర్లో మేలు చేసే హార్మోన్ సెరోటోనిన్ ఉండుట వలన ఈ పండు తిన్న వెంటనే ఒత్తిడి దూరం అయ్యి ఏకాగ్రత కుదురుతుంది.
ఈ పండులో విటమిన్ బి సమృద్ధిగా ఉండుట వలన నోటిపూత తగ్గించటంలో సహాయపడుతుంది.
బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్న వారికీ ఈ పండు చాలా సహాయపడుతుంది.
ఎందుకంటే దీనిలో కరిగే ఫైబర్ ఉంటుంది.అంతేకాక కొలస్ట్రాల్ ని కరిగించే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
అలాగే కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.