తెరాస లో చురుకైన నేత – కీలక మంత్రి – స్వయానా కెసిఆర్ కి మేనల్లుడు అయిన హరీష్ రావు కి భారీ షాక్ తగిలింది.సొంత నియోజికవర్గం సిద్ధిపేటలోనే ఇదంతా జరగడం ఇంకా విశేషం.
హరీశ్ కు ఎదురైన సంఘటనతో ఎల్లప్పుడు సంయమనంతో ఉండే హరీశ్ “మంత్రిని అయిన నాతోనే ఈ విధంగా వ్యవహరిస్తారా?” అంటూ ఆవేశపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.మెదక్ జిల్లా సిద్దేపేట మినీ స్టేడియం కోసం రెండున్నర కోట్లు మంజూరు చేసారు.
స్టేడియం లో ఇండోర్ షటిల్ కోర్టు – లాంగ్ టెన్నిస్ – ఖోఖో – పుట్ బాల్ – కబడ్డీ – బాస్కెట్ బాల్ కోర్టులకు ఈ మొత్తం కేటాయించారు.ఆయన్ని దాన్ని ఓపెనింగ్ కోసం పిలిచినా సమయంలో అంతా ఓకే కదా అని వెళ్లారు హరీష్.
తీరా అక్కడకి వెళ్లి చూడగా లాంగ్ టెన్నిస్ కోర్టు – బాస్కెట్ బాల్ కోర్టులు అసంపూర్తిగా ఉన్నాయి.కోర్టు లో పోల్స్ – లైట్స్ ఏర్పాటు చెయ్యకపోవడం ఇంకా విశేషం.
మినీ స్టేడియం డెవెలప్మెంట్ పూర్తి చేయకుండా అసంపూర్తి గా వదిలేయడమే కాకుండా తనకే షాక్ ఇచ్చేలా ప్రారంభోత్సవానికి పిలవడం అధికారులపై హరీష్ చాలా సీరియస్ అయ్యారు.పది హేను రోజుల పాటు అక్కడే ఉంది మరీ పనులు చూడాలి అని హౌసింగ్ ఈఈ విజయ్ కుమార్ పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో పాటు సిద్దేపేట లో డిగ్రీ కాలేజీ దగ్గర బాలికల హాస్టల్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ ఉండడం కూడా హరీష్ కి కోపం తెప్పించింది.