ప్రతి ఏటా జరిగే తెలుగుదేశం మహానాడుకు హాజరయ్యే నందమూరి కుటుంబం మచ్చుకు కూడా కనిపించక పోవటం మరో వైపు హరికృష్ణ వ్యాఖ్యలు పట్ల అటు పార్టీ వర్గాలతో పాటు సత్వత్రా చర్చానీయాంశ మవుతోంది.
శనివారం ఉదయాన్నే నందమూరి హరికృష్ణ తన కుమారుడు కల్యాణ్రామ్తో పాటు తారకరత్న, ఇతర కుటుంబసభ్యులతో ఎన్టీఆర్ గార్డెన్లోని తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావు సమాదికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాటా్లడుతూ… తెలుగుదేశం కార్యకర్త లంతా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడాల్సి న సమయం ఆసన్నమైందనా్నరు.
విభజనపై జరిగిన చర్చల్లో పదేళ్ళ ప్రత్యేక హోదా కావాలన్నవారు, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న వారు, హోదా తెస్తామని పడే పడే చెప్పిన వారు ఇప్పుడేందుకిలా మాట్లాడుతున్నారని హరికృష్ణ పరోక్షంగా చంద్ర బాబు, వెంకయ్య నాయుడు లపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు హోదా రానందునే తాను మహానాడుకు వెళ్లలేదని తన అసంతృప్తి బహిరంగగా వ్యక్తం చేసారు.ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు
తెలుగుదేశం పార్టి కి పెద్ద పండగ ఎన్టి ఆర్ జయంతి.
ఈ సందర్భంగా ఏటా నిర్వహించే మహానాడుకు నందమూరి కుటుంబం ఓ ఆకర్షణగా నిలచేవారన్నది నిజం.కాగా ఈ సారి అందునా ఎన్టీఆర్ కి ఇష్టమైన తిరుపతిలో జరుగుతున్న మహానాడుకు ఎవ్వరూ రాకపోవటం వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు వినవస్తోంది.
ఇప్పటికే .జూనియర్ ఎన్టిఆర్ షూటింగ్ పేరుతో ఓ రోజు ముందే తాతకి నివాళి అర్పించి పయనమవ్వగా, హడావిడి చేసి కల్యాణ్రామ్, తారకరత్నకూడా దూరంగా ఉండటం విశేషం.
అయితే నందమూరి వీర విధేయుడైన కొడాలి నాని ని తిరిగి పార్టీలో చేర్పించేందుకు చేసిన ప్రయత్నాలకు చంద్ర బాబు నో చెప్పడం కూడా ప్రస్తుత అలకలకు కారణంగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి
.