భారీ సెట్టింగ్లకు, భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న గుణశేఖర్ గత నాలుగు సంవత్సరాలుగా ‘రుద్రమదేవి’ సినిమాతోనే కుస్తీ పడుతున్నాడు.ఏడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం గుణశేఖర్ కలలు కంటూ, మూడు సంవత్సరాల క్రితం చిత్రీకణ ప్రారంభించాడు.
ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న ‘రుద్రమదేవి’ సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దం అయ్యింది.భారీ బడ్జెట్తో కాకతీయుల సామ్రాజ్యాన్ని మరియు రుద్రమదేవి పోరాటాన్ని దర్శకుడు గుణశేఖర్ కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేశాడు.
‘రుద్రమదేవి’ విడుదల అయిన తర్వాత మరో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథనే గుణశేఖర్ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
గుణశేఖర్ తన బ్యానర్లో తాజాగా ‘ప్రతాపరుద్రుడు’ అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించాడు.
దాంతో గుణశేఖర్ తర్వాతి సినిమా కూడా భారీ చారిత్రాత్మక సినిమానే అనే విషయం క్లారిటీ అయ్యింది.అయితే ఇప్పటి వరకు గుణశేఖర్ ఆ సినిమా గురించిన అధికారిక ప్రకటన చేసింది లేదు.
‘రుద్రమదేవి’ విడుదల అయిన తర్వాత ‘ప్రతాపరుద్రుడు’ తెరకెక్కే అవకాశాలున్నాయేమో అని అంటున్నారు.‘రుద్రమదేవి’ సక్సెస్పైనే ఈ కొత్త సినిమా ఆధారపడి ఉంటుంది.
ఒకేవేళ ‘ప్రతాపరుద్రుడు’ ఫైనల్ అయితే ఆ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.గుణశేఖర్ దర్శకత్వంలో నటించేందుకు ఎన్టీఆర్ నుండి చరణ్ వరకు అంతా కూడా సిద్దం ఉంటారు.
అందులో ఎవరు ప్రతాప రుద్రుడు అవుతారో చూడాలి.