తెలుగు ప్రేక్షకులు గత రెండు సంవత్సరాలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ మరియు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ రెండు దాదాపుగా ఒకే సారి ప్రారంభం అయ్యాయి.
ప్రారంభం అయిన సమయంలో ఈ రెండు సినిమాలపై ఒకే స్థాయి అంచనాలు ఉన్నాయి.అయితే పలు కారణాల వల్ల ‘రుద్రమదేవి’ సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి తగ్గింది.
పలు సార్లు వాయిదా పడటం, ఫస్ట్లుక్ మరియు టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకోక పోవడం కూడా ‘రుద్రమదేవి’పై అంచనాలు తగ్గేలా చేశాయని చెప్పవచ్చు.
మరో వైపు ‘బాహుబలి’ సినిమాపై రోజు రోజుకు అంచనాలు తారా స్థాయికి చేరడం జరుగుతోంది.
ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉన్నా కూడా అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.వాయిదా పడ్డా కూడా రాజమౌళి క్లారిటీగా ఆ విషయాన్ని ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు చెబుతూ చిత్రాన్ని ఎప్పుడు కూడా ప్రేక్షకుల మధ్యలో ఉంచుతున్నాడు.
షూటింగ్ పూర్తి అయిన ‘బాహుబలి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.మరో వైపు సినిమా పోస్టర్లు ఒక్కటొక్కటిగా విడుదల చేస్తూ జక్కన్న సందడి మొదలు పెట్టాడు.
అయితే ‘రుద్రమదేవి’ని ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్న గుణశేఖర్ సినిమా ప్రమోషన్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.విడుదల సమయంలో అయినా కొత్తగా క్రియేటివిటీగా ప్రమోషన్ చేసి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడేమో చూడాలి.
ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్గా అనుష్క నటించిన విషయం తెల్సిందే.