కృతి సనన్ వెనకాల ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు.అయినా అమ్మడికి మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ సరసన చేసే అవకాశం లభించింది.
ఆ సినిమా ఆడకపోవడంతో కమిట్ అయిన దోచెయ్ ఒక్కటి పూర్తి చేసేసి బాలివుడ్ వైపు పరుగులు తీసింది.హీరోపంటి ఫర్వాలేదనిపించటంతో అందరి దృష్టిని ఆకర్షించింది కృతి.
ఫలితంగా అక్షయ్ కుమార్ సరసన సింగ్ ఇజ్ బ్లింగ్ చిత్రంలో అవకాశం కొట్టేసింది.
సినిమా రిహర్సల్స్ లో పాల్గొంది.
ఒకటి రెండు రోజులు షూట్ కూడా చేసింది.అనుకోకుండా షారుఖ్ ఖాన్ దిల్ వాలే లో వరుణ్ ధవన్ సరసన నటించే అవకాశం వచ్చింది.
కాని డేట్స్ లేవు.అక్కడే అత్యాశపడింది కృతి.
తన పాత్రకు ఆ సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అని తెలిసి కూడా, దిల్ వాలే పెద్ద సినిమా కాబట్టి, సింగ్ ఇజ్ బ్లింగ్ ను వదిలేసి వెళ్ళిపోయింది కృతి.అక్షయ్ ఏమి అనలేదు.
తన స్థానంలో ఆమీ జాక్సన్ ను తీసుకున్నాడు.ఆ చిత్రం ద్వారా ఆమీ జాక్సన్ కు బాగా పేరు వస్తే, దిల్ వాలే ను కృతిని పట్టించుకున్నవారే లేరు.
షారుఖ్, కాజోల్ లాంటి హేమాహేమీలతో పాటు వరున్ లాంటి క్రేజి హీరో ఉన్న సినిమాలో కృతి కూరలో కరివేపాకులా తయారయ్యింది.కనీసం సినిమా అయినా బాగా ఆడుతోందా అంటే అదీ లేదు.
చేసిన నాలుగు సినిమాల్లో మూడో ఫ్లాప్ అందుకుంది కృతి.దెబ్బకు దెయ్యం వదిలి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి చిన్నహీరోతో ఇప్పుడు సినిమా చేస్తోంది ఈ సుందరి.మరో పక్క అమీ జాక్సన్ అదే అక్షయ్ కుమార్, రజినికాంత్ లతో 2.0 తో పాటు మరో రెండు పెద్ద చిత్రాల్లో నటిస్తోంది.