‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నారు ఓ మహా కవి.నిజమే…మాతృదేశానికి మించిన తల్లి లేదు కదా.ఈ భావనను గౌరవిస్తూ తెలంగాణ ఆడపడుచులు అమెరికాలో బోనాలు పండుగ ఘనంగా జరుపుకున్నారు.ఓహియోలోని మాసన్లో ‘గ్రేటర్ సిన్సినాటీ తెలంగాణ అసోసియేషన్’ (జీసీటీఏ) ఆధ్వర్యంలో బోనాలు పండుగ ఘనంగా జరిగింది.
పినెహిల్్స లేక్ పార్కును బోనాలు పార్కుగా మార్చారు.ఇక్కడ బోనాలు పండగ చేయడం ఇది నాలుగో ఏడాది.
గ్రేటర్ సిన్సినాటీ ఆఫ్ ఓహియో ఆధ్వర్యంలో నూటడెబ్బయ్ మంది బోనాలు ఉత్సవంలో పాలుపంచుకున్నారు.సిన్సినాటీ నుంచే కాకుండా డేటన్, ఉత్తర కెంటకీ నుంచి కూడా అనేకమంది హాజరయ్యారు.
మహిళంతా సంప్రదాయ వస్ర్తధారణతో హాజరయ్యారు.హైదరాబాదు, సికింద్రాబాదుల్లో బోనాలు ఎలా చేస్తారో అదే విధంగా చేశారు.
దీంతో ఇది అమెరికానా? తెలంగాణనా? అనే సందేహం కలిగిందంటే అతిశయోక్తి కాదు.అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
హారతులు ఇచ్చారు.జానపద గీతాలు ఆలపించారు.
అమ్మవారిపై పాటలు పాడారు.ఊరేగింపు కూడా తీశారు.
పోతరాజు కూడా నృత్యం చేశాడు.తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడే వంటకాలు చేశారు.
ఇండియా నుంచి వచ్చిన తెలుగు పర్యాటకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.బోనాలు జాతరకు సంబంధించిన ఫొటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
తెలుగువారు ఏ దేశంలో ఉన్నా తమ ప్రత్యేకత నిలుపుకుంటున్నారని, తమ మూలాలు, సంప్రదాయాలు మర్చిపెవడంలేదని చెప్పాడానికి ఇది నిదర్శనం.జయ జయహే తెలంగాణ…జననీ జయకేతనం.