పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల’.బాలీవుడ్ మూవీ ‘ఓ మైగాడ్’కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నారు.కాని కొన్ని కారణాల వల్ల ఆడియో విడుదల కార్యక్రమం లేదని తేలిపోయింది.
తాజాగా ఈ సినిమాలోని ఒక పాటను విడుదల చేయడం జరిగింది.
‘భజే భాజే’ అనే ఈ పాటు ప్రస్తుతం యూట్యూబ్లో తెగ హల్చల్ చేస్తోంది.
లహరి మ్యూజిక్ సంస్థ ఈ ఆడియోను దక్కించుకుంది.యూట్యూబ్లోని లహరి మ్యూజిక్ చానెల్లో ఈ పాటను శ్రోతలు వింటున్నారు.
కొత్త సంవత్సరం కానుకగా విడుదలన ఈ పాటను కొన్ని గంటల్లోనే లక్ష మందికి పైగా విన్నారు.ఇప్పటికే ఈ పాటకు 1.8 లక్షల వ్యూస్ వచ్చాయి.‘గోపాల గోపాల’ సినిమాపై ఏమాత్రం క్రేజ్ ఉందో ఈ వ్యూస్ను చూస్తుంటేనే తెలుస్తోంది.
శ్రియ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహించాడు.సురేష్బాబు మరియు శరత్ మరార్లు సంయుక్తంగా నిర్మించారు.