గ్రేటర్ హైదారాబాదు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఇక నెల రోజుల సమయమే ఉంది.
సంక్రాంతి పండుగ వెళ్ళగానే ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నారు.వచ్చే నెల 17వ తేదీన నిర్వహించవచ్చని సమాచారం.
అయితే ఇంకా నిర్దిష్టంగా తెలియదు.నగరంలో వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తీ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియచేయగానే అది తేదీ ప్రకటిస్తుంది.తేదీ ఏదైనప్పటికీ సంక్రాంతి వెళ్ళగానే ఎన్నికలు జరగడం ఖాయం.
ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు గతంలో మాదిరిగానే కొనసాగుతాయి.గ్రేటర్ హైదారాబాదు ఎన్నికలకు సంబంధించి గులాబీ పార్టీ ప్రచారం అప్పుడే జోరుగా సాగుతూనే ఉంది.
నగరాన్ని సంక్షేమ పథకాల ప్రచారానికి సంబంధించిన హొర్దింగులతొ నింపేసింది గులాబీ పార్టీ.అడుగడుగునా ముఖ్యమంత్రి కెసీఆర్ బొమ్మలే కనబడుతున్నాయి.
బహుశా క్రిస్మస్ పండుగ వెళ్ళగానే నాయకులు అసలు ప్రచారానికి సిద్ధం అవుతారేమో.గ్రేటర్ ఎన్నికల్లో నగరంలో స్థిర పడిన సీమాంధ్ర జిల్లాల ప్రజలే కీలక పాత్ర పోషించబోతున్నారు.
అధికార పార్టీ సహా అన్ని పార్టీలు వారి ఓట్ల కోసమే తాపత్రయ పడుతున్నాయి.