గ్రేటర్ ఎన్నికల కి సర్వం సిద్దం అవుతూ ఉండగా టీడీపీ , బీజేపీ , కాంగ్రెస్ మూడు పార్టీల టికెట్ లకీ విపరీతమైన డిమాండ్ వచ్చేసింది.హైదరాబాద్ మునిసిపల్ కార్పరేషన్ ఎన్నికల్లో వీరి దగ్గర టికెట్ ల కోసం చాలా గాలాలు వేస్తున్నారు క్యాండిడేట్ లూ.
ఈ మూడు పార్టీ లలో ఎవరికీ సొంతగా మేయర్ పదవి కొట్టే సీన్ లేదు అయినా కూడా ఈ టికెట్ ల కోసం ఎందుకు డిమాండ్ అంటే ఇది ఒకరకమైన లాటరీ అనమాట.
ఎదో ఒక మంచి డివిజన్ లో గెలిస్తే గనక లాటరీ కొట్టేసినట్లే.
ఎందుకంటే టీఆర్ఎస్ తో సహా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీపై నమ్మకాలు లేవు.పైకి మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయంతే.
ఒకసారి రిజల్ట్ వచ్చిన తరువాత మొదలవుతాయి బేరసారాలు.అసలే టీఆర్ఎస్ ప్రెస్టేజ్ గా ఫీలవుతోంది.
అధికారంలొ వుంది కాబట్టి, ఎంత ఖర్చు చేసయినా మేయర్ పీఠం తెచ్చుకోవాలి.అలాంటపుడు తక్కువ పడిన సీట్లకు వేలం పాట మొదలవుతుంది.
ఇప్పుడు కష్టపడి టికెట్ తెచ్చుకుని, ఓ కోటి రూపాయిలు ఖర్చుచేసి గెలవగలిగితే.పంట పండినట్లే.
అంతకు అయిదింతలు లాభాలు సంపాదించుకోవచ్చు.అందుకే టికెట్ ల కోసం అంత హడావుడి.
.