టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్లో నటించాలని ప్రతీ నటీ నటుడు కూడా అనుకుంటూ ఉంటారు.ఆ అవకాశం తాజాగా యువ హీరో నాని దక్కించుకున్నాడు.
త్వరలో నాని హీరోగా సినిమా నిర్మించబోతున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించాడు.గీతాఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను మారుతి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలో నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఆ వెంటనే గీతా ఆర్ట్స్ సినిమాలో నాని నటించనున్నాడు.
మెగా హీరో అల్లు శిరీష్ మరియు రెజీనాల కాంబినేషన్లో తెరకెక్కిన ‘కొత్త జంట’ చిత్రం తర్వాత మారుతి మరో సినిమాను చేసింది లేదు.అయితే ఇన్నాళ్లకు మళ్లీ నానితో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.
వరుసగా రెండు చిత్రాలను గీతాఆర్ట్స్లో చేసే అవకాశం దక్కించుకున్న మారుతి సంతోషంగా ఉన్నాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న మారుతి ఒక యూత్ స్టోరీతో ఈ సినిమాను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.