యువహీరో నితిన్ అగ్ర పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి కుమారుడు అన్న విషయం తెలిసిందే.వీరి డిస్ట్రిబ్యూషన్ సంస్థ పేరు “గ్లోబల్ ఫిలిమ్స్”.
ఏషియన్ సునీల్ – సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ సంస్థ వ్యవహారాలు చూసుకుంటారు.ఈ మధ్యకాలంలో నితిన్ కూడా తన పంపిణీ సంస్థ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు.
ఆ క్రమంలోనే తమ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ ద్వారా అఖిల్ తొలి చిత్రాన్ని నిర్మించాడు నితిన్
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, మన నితిన్ బాలకృష్ణ 100వ సినిమాకి సంబంధించిన నైజాం హక్కులను కొనేసాడు.అది కూడా భారి మొత్తానికి.గౌతమీపుత్ర శాతకర్ణి నైజాం హక్కులను నితిన్ సంస్థ 10.60 కోట్లు చెల్లించి కొనుక్కుంది.అందులో 1.60 కోట్లు రికవరేబుల్ కాగా, 9 కోట్లకి NRA చేసారు
సీడేడ్ లో 9 కోట్లకి అమ్ముడుపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి, తెలుగు రాష్ట్రాల్లోనే 35-40 కోట్ల బిజినెస్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.అంటే, బాలకృష్ణ కెరీర్లో హయ్యెస్ట్ అన్నమాట.అంటే సినిమా అద్భుతంగా రావాల్సిందే.క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి, సుహాసిని పంగులూర్ నిర్మాతలు.శ్రియ కథనాయికగా నటిస్తోంది.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.