తెలంగాణా రాష్ట్రంలో అటు అధికార టీఆరఎస్.మరియు ప్రతిపక్ష తెలుగుదేశం మధ్చ మాటల వేడి రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది…ఇప్పటికే రేవంత్ టీఆరఎస్ పై మాట్లాడుతూ.
తాను మైక్ పట్టుకుంటే టీఆరఎస్ పార్టీకి…మరియు కేసీఆర్ కు వణుకు పుడుతుంది అని విమర్శించగా.దానికి కౌంటర్ గా కేసీఆర్ తమ పార్టీ ఎం.ఎల్ఏ గంగుల కమలాకర్ ను రేవంత్ పైకి వదిలారు…ఇక కమలాకర్ తన ఒరిజినల్ క్యారెక్టర్ ను చూపిస్తూ…రేవంత్ పై విరుచుకు పడ్డారు.మా పార్టీ పై, సిఎం కెసిర్పై నిరాధారమైన ఆరోపణలను చేస్తూ పిచ్చికుక్కలా మొరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఓ నాయకుడి మెప్పుకోసం పెంపుడుకుక్కలా మారి సింహాన్ని అనుకుంటున్నావేమో.
తాము కనుసైగ చేస్తే మాడిమసైపోతావని గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.గనులశాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, అందులో తమ పాత్ర ఉందని, మిషన్ కాకతీయ.కమీషన్ కాకతీయగా మారిందని, చెక్పోస్టులను సిఎం కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఎత్తివేయించామని నిరాధారమైన ఆరోపణలు చేస్తావా? అంటూ మండిపడ్డారు.అయితే గంగుల మాటల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలీదు కానీ.
ఆయన వాడిన పధ జాలం మాత్రం ఒక ఎం.ఎల్.ఏ స్థాయిని దిగజార్చే విధంగా ఉంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి… మరి దీనిపై రేవంత్ ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి.