రెండు సంవత్సరాల సుధీర్ఘ చిత్రీకరణ జరుపుకున్న ‘గంగ’(ముని`3) సినిమా ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ పూర్తి అయ్యింది.వరుసగా ఫస్ట్లుక్ పోస్టర్, ఫస్ట్లుక్ టీజర్ విడుదల చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.
ఈనెల 17న అంటే రేపు ‘గంగ’ను తెలుగు మరియు తమిళంలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు లారెన్స్ మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్లు ప్రకటించారు.విడుదల దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగా చేయడం మొదలు పెట్టారు.
రేపు విడుదల తేదీ అయినా ఇప్పటి వరకు విడుదలలో క్లారిటీ లేదు.టీవీల్లో ప్రమోస్ను కూడా నిలిపేయడం జరిగింది.
మొదటి నుండి కూడా ఈ సినిమా వాయిదా పడనుందనే వార్తలు వస్తున్నాయి.అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం వాటిని తోసి పుచ్చుతూ వచ్చారు.
అయితే విడుదల మరో మూడు రోజులు ఉందనగానే ఈ సినిమా నిలిపేయాలని నిర్మాత నిర్ణయించుకున్నాడు.నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ సినిమా విడుదల వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు.
సినిమా విడుదల అవ్వాలంటే బెల్లంకొండ ఫైనాన్సియర్స్కు దాదాపు 10 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉందట.దాంతో ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో బెల్లంకొండ ఉన్నాడు.
‘గంగ’ తర్వాత విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది చూడాలి.రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ సినిమాలో తాప్సి మరియు నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటించారు.