సెలబ్రిటీలు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏం చేసినా అది మీడియాకు వార్త అవుతుంది.అందులోను రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నాయకులు కలుసుకుంటే అది టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది.
ఇక అసలు వార్త ఏమిటంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్, సినిమా హీరో కం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలుసుకున్నారు.ఎక్కడ? వై కా పా నాయకుడు, తిరుపతికి చెందిన భూమన కరుణాకర రెడ్డి కుమారుడి పెళ్ళిలో.ఈ పెళ్లి హైదరాబాదులోనే జరిగింది కాబట్టి బాలయ్య కూడా హాజరయ్యారు.జగన్ -బాలయ్య ఒకరికొకరు ఎదురు పడ్డారు.అది పెళ్లి.రాజకీయ వేదిక కాదు కదా.అందుకే నవ్వులతో పలకరించుకున్నారు.బాలయ్యను చూడగానే జగన్ నవ్వాడు.
వెంటనే బాలయ్య కూడా అదే పని చేసాడు.ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారట.
అంత మందిలో ఎక్కువసేపు మాట్లాడుకోలేరు కదా.రెండు మూడు నిమిషాలు ఒకరికొకరు యోగ క్షేమాలు తెలుసుకొని ఉండొచ్చు.నాయకులు మామూలు రోజుల్లో రాజకీయాల పరంగా ఎంతగా విమర్శించుకున్నా శుభ కార్యాల్లో కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా మాట్లాడుకుంటారు.మనసులో ఎలాని భావాలు ఉన్నా పైకి సంస్కారయుతంగా ఉండాలి కదా.