మరోసారి అల్లు అర్జున్ సినిమాకి ఫేక్ ట్యాగ్ అంటుకుంది.గత ఏడాది వచ్చిన సరైనోడుని సొంత సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.
నిర్మాత అల్లు అరవింద్ కి తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి.సరైనోడుని ఆయనే సొంతంగా కొన్ని ఏరియాల్లో పంపిణి చేసారు కూడా.
డిస్ట్రిబ్యూట్ చేసిన ఏరియాల్లో, సొంత థియేటర్ల కలెక్షన్ల నుంచి కేవలం ట్యాక్స్ మాత్రమే కట్ చేసి, థియేటర్ రెంట్ కలపకుండా నెట్ నే షేర్ గా చూపిస్తూ, కలెక్షన్లు పెంచి చెబుతున్నారనే అపవాదు ఆ సినిమాపై పడింది.అందుకే సరైనోడు కలెక్షన్ల విషయంలో ట్రెడ్ వర్గాల్లో పలురకాల రిపోర్ట్స్ ప్రచారంలో ఉన్నాయి.
ఒక్కో రిపోర్టుకి మరో రిపోర్టుకి మధ్య తేడా కూడా చాలానే ఉంది.
ఇప్పుడు డీజే – దువ్వాడ జగన్నాథం విషయంలో కూడా అదే జరుగుతోంది అని టాక్.
ఈ సినిమాని నైజాం, వైజాగ్, కృష్ణ ఏరియాల్లో దిల్ రాజు సొంతంగా పంపిణి చేస్తున్నారు.విడుదల చేసిన థియేటర్లలో ఎక్కువ శాతం దిల్ రాజు థియేటర్లు, అల్లు అరవింద్ థియేటర్లు ఉన్నాయి.
బన్ని రేంజ్ పెరిగినట్టుగా చూపించేందుకు అల్లు అరవింద్ దిల్ రాజుని కూడా రెంట్స్ తీసేయకుండా షేర్ కలెక్షన్లు ప్రకటించేలా చేస్తున్నారని, పవన్, మహేష్, ఎన్టీఆర్ సినిమాల కంటే దువ్వాడ జగన్నాథం వీకెండ్ షేర్స్ ఎక్కువ ఉండటానికి ఇదే కారణం అని ట్రేడ్ లో ఓ వర్గం వాదన.సింపుల్ గా చెప్పాలంటే, నెట్ = షేర్ .ఈ లెక్కన రిపోర్ట్స్ ఉంటున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.దువ్వాడ జగన్నాథం బాక్సాఫీస్ కలెక్షన్లలో ఫేక్ ఉన్నట్లు ఓ జాతీయ దిన పత్రిక కూడా కథనం రాయడం విశేషం.
మరి ఇందులో నిజమెంతో అబద్ధం ఏంతో.
మరోవైపు దిల్ రాజు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.
డీజే – దువ్వాడ జగన్నాథం కలెక్షన్లు చూసి ఓర్వలేకే ఈ దుష్ప్రచారం మొదలుపెట్టారని, ఇందులో నిజం లేదని కొట్టిపారేసారు.మరి తెలుగు సినిమా మార్కేట్ పెరిగినట్టా, బన్ని రేంజ్ పెరిగినట్టా లేక ఇందులో ఫేక్ ఉన్నట్టా?
.