బడులు తెరచే సమయం ఆసన్నమవుతుండటంతో విద్యార్ధులు ఆనందంతో వేసవి జ్ఞా పకాలను నెమరు వేసుకుంటూ తమ మిత్రులతో పంచుకునేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తుంటే, పాఠశాలల యాజమాన్యాలతో తల్లిదండ్రులు సిద్దమవుతున్నారు
ఏ ఏటికా ఏడు ్రపయివేటు విద్యా సంస్ధలు తమ ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తుండటం, నియం్రతణ చేయాల్సిన అధికారులు చోద్యం చూడటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పేరంట్్స కమిటీ యుద్దానికి అందరినీ సిద్దం చేసింది.
ప్రవేట్ పాఠశాలల్లో ఫీజులు దోపిడీతో సామాన్యుల జీవనం చిన్నాభిన్నమవుతోందని, అనేక స్కూల్లో కనీస సౌకర్యాలు లేకపోవటాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాడతామని పేరంట్ కమిటీ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ విద్యా మండలి అధికారులు ముందుకొచ్చి పరిష్కారం దిశగా నేపధ్యంలో ప్రవేటు విద్యా సంస్థల యజమాన్యాల తో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి యజమాన్యాల తరపున ఎవ్వరూ హాజరు కాకపోవటం ఆందోళనకు అజ్యం పోసింది.
ప్రయివేటు కళాశాలలపై దృష్టి పెట్టి వారి ఆటలు కట్టించిన ముఖ్యమం్రతి కేసీఆర్, ప్రయివేటు పాఠశాలల దందాపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు .ఫీజుల భారం దించాలని కోరుతూ బుధవారం తెలంగాణ విద్యా మండలి ఎదుట తల్లిదండ్రులు భారీ ధర్నా చేయనున్నారు
సిఎం గారూ! ప్రయివేటు దందాపై దృష్టి పెట్టండి…
.