కిడ్నీలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి.అందుకే ప్రమాదాల బెడద ఎక్కువ వాటికి.
టాక్సిన్స్ ఎక్కువగా దాడి చేసేది కిడ్నీలనే.కిడ్నీలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతేనే కిడ్నీ ఫేల్యూర్ సమస్యలు, ఇన్ఫెక్షన్ సమస్యలు, కిడ్నీల్లో రాళ్ళు వస్తాయి.
కాబట్టి కిడ్నీలను శుభ్రం చేసుకోవాలి ? ఎలా అంటారా ?
* ఆపిల్ సీడెడ్ వెనిగర్ ని ఏ డాక్టర్ అయినా నిర్మొహమాటంగా సజెస్ట్ చేస్తాడు.అలాంటి శక్తివంతమైన పదార్థం ఇది.దీనికి నేచురల్ క్లీన్సేనర్ అనే పేరు కూడా ఉంది.గ్లాసు నీటిలో ఓ రెండు టీస్పూను ఆపిల్ సీడెడ్ వెనిగర్ కలుపుకొని రోజు ఉదయాన్నే తాగితే బాడిలో టాక్సిన్స్ ని బయటకి లాగవచ్చు.
* ఉదయాన్నే నిమ్మరసం తాగే అలావాటు చేసుకున్న మంచిదే.నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది.
* పైనాపిల్, ఆపిల్, ఆరెంజ్, పీచ్ తో కలిపి చేసిన జ్యూస్ కూడా బాగా పనికివస్తుంది.
* పాలకూర, క్యారట్, గ్రీన్ ఆపిల్, పార్స్లీ ఆకులు, కాలే, దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఉదయం లేవగానే దీన్ని సేవించడం వందరకాలుగా ఉపయోగం.
* బీట్ రూట్ లో పొటాషియం బాగా ఉంటుంది.
ఇది మలీనాల్ని ఈజీగా బయటకి తెస్తుంది.కాబట్టి బీట్ రూట్ ని ప్రేమించండి.
* క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.కాని చక్కర కలపకుండా తాగండి.