మనిషికి ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే దాక డబ్బులు అవసరం ఉంటుంది.డబ్బులు ఉండాలంటే లక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉండాలి.
ఆరోగ్యం, సౌభాగ్యం,పేరు ప్రతిష్టలు, ధైర్యం,ధాన్యం,విద్యా ఇలా ఏది కావాలన్నా డబ్బు ఉండాల్సిదే.అందువల్ల లక్ష్మి కటాక్షం ఉండాల్సిదే.
ఆమె చల్లని చూపు మన మీద ఉంటేనే జీవితాన్ని సంతోషంగా గడపగలం.శుక్రవారం అమ్మవారిని ఇలా పూజిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన పూలు,నైవేద్యంలతో పూజ చేస్తే మంచిది.శుక్రవారం ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానము చేసి అమ్మవారికి ఇష్టమైన తెల్లని పూలతో పూజ చేయాలి.
అలాగే శుక్రవారం నాడు సాయంకాలం దీపాలు పెట్టేలోపు, ఇంటిని శుభ్రపరచుకుని… శుభ్రంగా ఆడవారు తయారు అయ్యి ఇంటి ముఖద్వారం గుమ్మాన్ని అలంకరించాలి.
గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టి గుమ్మానికి రెండు వైపుల తెల్లని పూలను అలంకరించాలి.
అమ్మవారికి శుక్రవారం రోజున తెల్లని పూలతో పూజిస్తే చాలా ఇష్టం.శుక్రవారం నాడు గుమ్మానికి తెల్లని పూలు రెండు వైపులా పెట్టడం తో పాటు, అమ్మవారికి తెల్లని పూల దండ వేసి, తెల్లని పూలతో పూజిస్తే ఆమె చాలా సంతోషపడి…మన మీద ఆమె అనుగ్రహాన్ని చూపి జీవితంలో సుఖసంతోషాలను కలిగిస్తుంది.