ఆ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడంటూ ఆరోపణలు ఎదుర్కున్నకేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్.క్రికెట్ నుంచి జీవితకాల నిషేధానికి గురయ్యాడు.
కొన్నాళ్లపాటు జైళ్లో వుండి బెయిల్ మీద బయటకొచ్చిన వెంటనే పెళ్లి చేసుకుని అందరికీ ఆశ్చర్యానికి గురిచేశాడు.ఇక ఇప్పుడు క్రికెట్ ను వదిలేసిన శ్రీశాంత్ ఇప్పుడు సినిమా ల మీద దృష్టి సారించాడు .
శ్రీశాంత్ అతి త్వరలో టాలీవుడ్ లో కనిపించబోతున్నాడని సమాచారం .ఈమాట ఎవరో అన్నది కాదు… స్వయంగా ఆయనగారే సెలవిచ్చారు .పర్సనల్ పనిమీద శుక్రవారం హైదరాబాద్ వచ్చిన శ్రీశాంత్, మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో మీడియా కంటపడ్డాడు.ఏంటి సడన్ గా హైదరాబాద్ లో కనిపించారని మీడియా అడగ్గా తాను తెలుగులో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నానని ,దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చానని తెలిపాడు.
అంతేకాదు ఈ సినిమా విషయం మీద తెలుగు దర్శకునితో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించాడు.త్వరలోనే తన సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేస్తానని అతను స్పష్టం చేశాడు.
ఇదిలావుండగా… అంతర్జాతీయ స్థాయిలో వున్నప్పుడే స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన ఈ కుర్రోడు.ఇప్పుడు సినిమాల్లో ఇంకెన్ని దుమారాలు రేపుతాడోనని అందరూ చర్చించుకుంటున్నారు.