దేవాలయం లోకి ప్రవేశించగానే మొదట మన శరీరం శుచిగా ఉండాలి.అలాగే మన మనస్సులో కూడా కామక్రోధాది వికారాలు లేకుండా చూసుకోవాలి.
దేవాలయంలో వెళ్ళగానే మొదట కాళ్ళను శుభ్రంగా కడుక్కొని తల మీద నీళ్లు జల్లుకోవాలి.ఆ తర్వాత గోపురం ఆ తర్వాత సింహద్వారపు గడపకు ఆ తర్వాత ధ్వజ స్తంభానికి నమస్కరించాలి.
ఆ తర్వాత గంటను మ్రోగించి దేవుని దర్శనం చేసుకోవాలి.
దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి.
దేవాలయం అంటే చాలా పవిత్రమైన స్థలం.అందువలన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.