ఏపీలో 2019 రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీలకు తోడుగా కొత్తగా పోటీకి రెడీ అవుతోన్న పవన్కళ్యాణ్ జనసేనతో ఇక్కడ ముక్కోణపు పోటీ జరగనుంది.
ఇక కాంగ్రెస్, కామ్రేడ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో చాలామంది స్టార్లు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో రంగంలోకి దిగుతున్నారు.
వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉండగానే అప్పుడే ఏపీ ఎన్నికలకు సినీ శోభ సంతరించుకుంది.పవన్కళ్యాణ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయనుంది.
పవన్ స్వయంగా అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.ఇక పవన్ అన్న నాగబాబు కాకినాడ నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక వరుణ్తేజ్ కూడా జనసేనకు మద్దతుగా ప్రచారం చేయనున్నాడట.ఇక ఇదే పార్టీ నుంచి హీరో శివాజీ గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడట.
ఇక జనసేన నుంచే గుంటూరు లేదా రాజమండ్రి అసెంబ్లీ బరిలో ప్రముఖ హాస్యనటుడు ఆలీ పేరు వినిపిస్తోంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే ఇప్పటికే టాప్ హీరో బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి స్టార్ క్యాంపెయిన్ కానున్నాడని వార్తలు వస్తున్నాయి.ఇక వీరికి తోడుగా మరికొంతమంది సినీస్టార్లను కూడా చంద్రబాబు ప్రచారంలోకి దింపనున్నారు.
ఇక కింగ్ నాగార్జున వైసీపీ నుంచి గుంటూరు లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా వచ్చే ఎన్నికల్లో కూడా నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
మోహన్బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక తన బావ జయదేవ్ కోసం ప్రిన్స్ మహేశ్బాబు నేరుగా కాకపోయినా సోషల్ మీడియాద్వారా ప్రచారం చేసే ఛాన్స్ ఉంది.
ఇలా టాలీవుడ్ స్టార్స్ అందరూ వచ్చే ఎన్నికల్లో ఏపీలో డైరెక్ట్ గానో ఇన్ డైరెక్ట్గానో రంగంలో ఉండడంతో ఎన్నికల్లో సినీగ్లామర్ అదిరిపోనుంది.