దొంగ బాబాల గురించి, వారు చేసే నీచపు పనులు గురించి రోజుకి ఏదో ఒక వార్త చదువుతూనే ఉన్నాం.అయినా, మమ్మల్ని బలివ్వమంటూ జంతువులే కసాయి వాడి దగ్గరకి వెళుతున్నట్లు బాబాల దగ్గరకి వెళుతుంటారు పిచ్చి జనాలు.
మతం ముసుగు వారిది, మతం మీద వెర్రినమ్మకం వీరిది.
మరో బాబా నీచకృత్యాలకి మరో అమ్మాయి బలైంది.
ఒడిషాలోని ఖండగిరి దగ్గర ఓ 60 ఏళ్ళ బాబా ఉన్నాడట.గతవారం జగన్నాథ్ మేలాలో ఓ ఆమాయకపు అమ్మాయిని దీక్ష పేరుతో ఆశ్రమానికి రమ్మని పిలిచాడు.
ఆ అమ్మాయి మొన్న, సోమవారం బాబా ఆశ్రమానికి వెళ్ళింది.పొద్దునంతా ఏవో దైవం అలా, ఇలా అంటూ కాకమ్మ కబుర్లు చెప్పాడట.
మధ్యాహ్నం అయ్యేసరికి బాబా మాటలు తేడాగా అనిపించే సరికి వెళ్ళిపోతాను అని బయలుదేరే ప్రయత్నం చేసిందట.అప్పుడే వెళ్ళిపోయుంటే బాగుండు.
ఈరోజు రాత్రి దీక్ష చేయాలి, అప్పుడే వెళ్ళిపోతే ఎలా అని ఆపేశాడు.దీక్ష లేదు పూజ లేదు, అర్థరాత్రి ఆ అమ్మాయిని ఆశ్రమంలోనే కిరాతకంగా హింసించి మానభంగం చేసాడట.
మంగళవారం తప్పించుకున్న అమ్మాయి పోలిసుల దగ్గరకి వెళ్ళలేదు.ఎందుకు అంటే, అలా చేస్తే ఆ బాబా చంపేస్తానని బెదిరించాడట.
జాలిపడాల్సిన విషయం ఏమిటంటే, ఈ అమ్మాయి ఇంట్లో కూడా ఉండకుండా, పోలీసులకి చెప్పకుండా, ఆ బాబా బెదిరింపులకి భయపడి ఎక్కడో కటక్ దగ్గర వేరే ప్రాంతంలో గాయాల దేహంతో చలికి వణుకుతూ దాక్కోని కనబడింది.మరి ఇప్పుడు విషయం బయటపడ్డాక ఈ మీడియా గారు, పోలీసులు ఆ దొంగ బాబాని ఏం చేస్తారో చూడాలి.