ఉదయం లేస్తే చాలు ఫేస్ బుక్ లో కాలక్షేపం చేస్తుంది మన తరం యువత.ఫేస్ బుక్ విడిగా ఒక దేశం గా డిక్లేర్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గల దేశం గా ఇది చలామణీ అవుతుంది అనేది విశ్లేషకుల తీర్పు.
అయితే ఫేస్ బుక్ భవిష్యత్తు ని చూస్తే ఆశ్చర్యపోక మానరు ఎవరూ.ఫేస్ బుక్ వాడకం దార్ల లో ఇప్పటికే ఎన్నో లక్షల మంది చనిపోతూ ఉన్నారు.
ఇలా వెళుతూ వెళుతూ 2098 నాటికి ఫేస్ బుక్ పరిస్థితి ఏంటి అని చూస్తే అది వాడిన వారు ఎవ్వరూ అప్పటికి బతికి ఉండే ఛాన్స్ లేనే లేదు సో అప్పటికి వందల కోట్ల మంది చచ్చిపోయి ఉంటారు.వారు ఎకౌంటు లు ఫేస్ బుక్ లో ఖాళీగా పడి ఉంటాయి.
అప్పుడు ఫేస్ బుక్ ఒక స్మశాన వాటిక గా మారిపోతుంది అంటున్నారు విశ్లేషకులు.అంటే.
వారి మరణం తర్వాత ఆ అకౌంట్లు మొత్తం నిర్జీవంగా మారే వీలుంది.ఒకవేళ.
ఎవరైనా సన్నిహితులు.కుటుంబ సభ్యులకు ఫేస్ బుక్ పాస్ వర్డ్ తెలిస్తే.
అకౌంట్ క్లోజ్ చేయొచ్చు.
అలా కాకుండా.
శ్మశానంలో సమాధుల మాదిరి.ఫేస్ బుక్ అకౌంట్లు మొత్తం నిర్జీవంగా మారతాయి.
రానున్న రోజుల్లో ఫేస్ బుక్ వాడే వారు పెరిగితే ఫర్లేదు.లేదంటే.
ఫేస్ బుక్ మొత్తం సమాధుల కిందనే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.ఫేస్ బుక్ లో అకౌంట్లు ఉన్న వారి మరణాల లెక్కలు చూస్తే.2010లో 3.85లక్షల మంది మరనిస్తే.2012లో 5.8లక్షల మంది మరణించారు.ఈ ఏడాది పూర్తి అయ్యే నాటికి 9.7లక్షల మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు.ఈ లెక్కన 2098 నాటి పరిస్థితి లెక్కేస్తే.?
.