టాలివుడ్ డ్రగ్స్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.మొదటి విడత డ్రగ్స్ వినియోగదారులు/ డ్రగ్స్ వినియోగదారులతో సంబంధం ఉన్నవారిని విచారిస్తామని లిస్టు అనౌన్స్ చేస్తున్నప్పుడే రానా దగ్గుబాటి పేరు ప్రముఖంగా వినిపించింది.
అయితే మొదటి విడత పేరులో రానా పేరు రాలేదు.కెమెరా మెన్ శ్యాం కె నాయుడు విచారణలో ఇద్దరు నిర్మాతల కొడుకుల పేర్లు చెప్పినట్లు తెలిసింది.
దాంతో మళ్ళీ అందరి ఫోకస్ రానా మీద పడింది.ఆ ఇద్దరు ఎవరు అనేది సిట్ టీమ్ కి తెలుసు.
బయటకి మాత్రం ఇద్దరు నిర్మాతల కొడుకులు అని మాత్రమే తెలుసు.పేర్లు తెలియవు.
ఇదిలా ఉంటే రానా కోసం ఫిలింనగర్ లో ఉన్న రామానాయుడు స్టూడియోస్ కి ఒక పార్సల్ వచ్చింది.దాంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు వెంటనే రామానాయుడు స్టూడియోస్ కి వెళ్లి ఆ పార్సల్ ని తనిఖి చేశారట.
అయితే అందులో ఎలాంటి మత్తుపదార్థాలు లేవు.ఫర్నిచర్ కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి అంతే.
ఈ వార్త కాస్త బయటపడటంతో మీడియా రకరకాలుగా కథనాలు వేయడం మొదలుపెట్టింది.
దాంతో రానా మండిపడ్డాడు.
పార్సల్ లో కేవలం ఫర్నిచర్ కి సంబంధించిన వస్తువులు తెప్పించుకున్నానని, తనకి డ్రగ్స్ అలవాటు లేదు అని ఇదివరకు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ఓ సినిమా విడుదలకి రెడీగా ఉంది, ఓ షో చేస్తున్నాను, ఇంకా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి, ఇలాంటి అనవసరపు విషయాల కోసం తన వద్ద సమయం లేదు, మీడియా బాధ్యతగా వ్యవరహరించడం నేర్చుకోవాలి, విషయాన్ని పూర్తిగా తెలుసుకోకముందు ఏది పడితే అది రాయకూడదు అంటూ విరుచుకుపడ్డాడు రానా.
అంతా బాగానే ఉంది కాని, రానాకి దుబాయి నుంచి వచ్చిన పార్సల్ ని ఎందుకు చెక్ చేయాల్సివచ్చింది ? నిప్పు లేనిదే పొగ రాదు అంటారు మరి.