చెక్ బౌన్స్ కేసులో సాధారణంగా బాదితుడుకే పరి పూర్ణ న్యాయం జరుగుతుంది .చాలా మంది చెక్ రూపంలో ఇస్తే ఇవ్వవలసినది ఎగవేయవచ్చు అనే టెక్నిక్ కనబరుస్తుంటారు .
కొంతమంది ఇప్పుడు ముఖాన కొడితే ఎప్పుడో మీదకు వస్తాడు అప్పుడు చూసుకోవచ్చు అనే ఆలోచన అమలు చేస్తుంటారు .ఈ నేపధ్యంలో మైలవరం మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్బాబుకు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.2012 వ సంవత్సరంలో దుర్గాపురానికి చెందిన శ్రీకాంత్కు మాజీ ఎమ్మెల్యే రమేష్బాబు రూ.10 లక్షల చెక్ రూపం లో ఇచ్చారు .సదరు చెక్ బౌన్స్ అయింది.దాంతో పలుమార్లుఓరల్ గా చెప్పిచూసినా ఫలితం లేనందునా చివరికి బౌన్సు చెక్ తో కోర్టునాశ్రయించారు
.