సమైక్యాంధ్రకు చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్కుమార్రెడ్డికి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా బద్ధవిరోధం ఉంది.కిరణ్ ఫ్యామిలీ ఆదినుంచి కాంగ్రెస్లోనే ఉంది.
కిరణ్ తండ్రి టైంలో ఆయనతో కలిసి పనిచేసిన చంద్రబాబు తర్వాత టీడీపీలోకి వచ్చి సీఎం అయ్యారు.అసెంబ్లీలో కిరణ్కుమార్రెడ్డి టీడీపీ వాయిస్ను అణిచి వేస్తున్నారని.
కిరణ్ తన ముందు పాలిటిక్స్లో చిన్నపిల్లాడు అని.ఆయన తండ్రితో కలిసి పనిచేశానని.తనకు గౌరవం ఇవ్వాలని చంద్రబాబు పదే పదే వేడుకున్నట్టుగా రిక్వెస్టులు చేసేవారు.
ఏదేమైనా చంద్రబాబు అంటే కిరణ్కు అస్సలు గిట్టేది కాదు.అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు చెంతకే, ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోందా ? అంటే అవుననే ఆన్సర్ టీడీపీ వర్గాల్లో చర్చకు వస్తోంది.కాంగ్రెస్ పార్టీ స్టేట్ను డివైడ్ చేయడంతో ఆ పార్టీపై తిరుగుబావుటా ఎగరవేసిన కిరణ్కుమార్రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.
ఆ పార్టీ తరపున కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరు నుంచి పోటీచేసిన ఆయన తమ్ముడు కూడా ఓడిపోయాడు.అప్పటి నుంచి కిరణ్ రాజకీయంగా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు.
తర్వాత ఆయన బీజేపీలోకి, జనసేనలో చేరతారని వార్తలు వచ్చినా ఆయన మాత్రం సైలెంట్గానే ఉన్నారు.ఇక ఇప్పుడు ఆయన్ను టీడీపీలోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కిరణ్కుమార్రెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందారు.ఆయన్ను పరామర్శించేందుకు ఇటీవల టీడీపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరనాధరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్ గీర్వాణీ చంద్రప్రకాష్ తదితర ప్రముఖులు నగిరిపల్లిలో నల్లారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పనిలో పనిగా నల్లారి కుటుంబసభ్యులందరిని చంద్రబాబు సూచన మేరకు టీడీపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.
ఇక నల్లారి ఫ్యామిలీ నుంచి రాజంపేట ఎంపీ టిక్కెట్టు, పీలేరు అసెంబ్లీ సీటుతో పాటు టీటీడీ చైర్మన్ పదవి కావాలన్న డిమాండ్లు వచ్చాయట.
వీటిల్లో కిరణ్ ఎంపీ కోరుకుంటే ఎంపీ టిక్కెట్టు, ఎమ్మెల్యే కోరుకుంటే ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.