సమైక్యాంధ్రప్రదేశ్కు చివరి సీఎంగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు.గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించిన కిరణ్కుమార్రెడ్డి రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక ఘోరంగా ఓడిపోయారు.
అప్పటి నుంచి సైలెంట్గా ఉంటోన్న కిరణ్ తిరిగి పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఆయన బీజేపీలోకి వెళతారని ముందుగా ప్రచారం జరిగింది.
ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళతారని మరో టాక్ వచ్చింది.
ఇక ఆ తర్వాత కిరణ్ రూటు జనసేన వైపు మళ్లిందని, ఆ పార్టీలో పవన్ తర్వాత ప్లేస్ను కిరణ్కే ఇస్తారంటూ మరో టాక్ కూడా వచ్చింది.
ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీకి రెడీ అవుతోన్న జనసేన కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్న రాజకీయ నాయకులతో పాటు యువతను ప్రోత్సహించేందుకు రెడీ అవుతోంది.ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటోన్న కిరణ్ హైదరాబాద్లో సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు.ఇక కిరణ్కుమార్రెడ్డి జనసేనలో చేరితే ఆయన చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా రాజంపేట నుంచి లోక్సభకు అయినా పోటీ చేయవచ్చని టాక్.ఇక పార్టీలో పవన్ తర్వాత సెకండ్ ప్లేస్ కిరణ్కుమార్రెడ్డికే ఇస్తామని జనసేన వర్గాల నుంచి ఆయనకు ఆఫర్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
కిరణ్కుమార్రెడ్డి జనసేనలో చేరితే రాయలసీమలో బలంగా ఉన్న పవన్ సొంత సామాజికవర్గం బలిజలతో పాటు రెడ్డి వర్గం ఓటర్లు కూడా కొంతమంది ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.మరి కిరణ్ ఇప్పటకీ అయినా పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా ? లేదా రీ ఎంట్రీ వార్తలు మరోసారి వార్తలుగానే మిగలనున్నాయా ? అన్నది చూడాలి.కిరణ్ జనసేనలో చేరితే ఆ పార్టీకి సీమలో మంచి ఊపు రావడం మాత్రం ఖాయం.