ఎప్పుడెప్పుడా అని భారతీయ ప్రజలు ఎదురుచూస్తున్న జియో ఫోన్ ప్రకటన రానే వచ్చేసింది.నిన్న జరిగిన సమావేశంలో ముఖేష్ అంబాని ఈ సంచలనాత్మక మొబైల్ ని ప్రపంచానికి పరిచయం చేసారు.
దీని పేరు జియో ఫోన్.దీనికి మళ్ళీ తల తోక ఏమి అంటించలేదు.
ఇది పూర్తిగా స్మార్ట్ ఫోన్ కాదు, అలాగని కేవలం ఫీచర్ ఫోన్ కాదు.రెండు కలిసిన హైబ్రిడ్ ఫోన్ లాంటిది అనుకోండి.
ఈ స్పెషల్ గురించి వింతలు విశేషాలు ఏంటో చూడండి.
* ఆగష్టు 15న మొబైల్ బేటా వెర్షన్ లాంచ్ అవుతోంది.
ఆగష్టు 24 నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతాయి.
* ఈ ఫోన్ ని మీరు పూర్తి ఉచితంగా పొందుతున్నట్లే లెక్క.ఎలా అంటే, ఈ ఫోన్ ని రూ.1500 పెట్టి బుక్ చేసుకోవాలి.మీరు కట్టిన ప్రతి రూపాయి మూడు సంవత్సరాల తరువాత రీఫన్డబుల్.అంటే, రూ.1500 ని మీరు మూడు సంవత్సరాల తరువాత రివర్స్ పొందవచ్చు.
* ఇది 4G ఫోన్.
LTE తో పాటు VoLTE నెట్వర్క్స్ పై పనిచేస్తుంది.
* ఇది 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.
* ఇందులో ఎమర్జెన్సి కాల్ ఆప్షన్ ఉంది.మీరు ముందే మీ సన్నిహితుడు/సన్నిహితురాలు ని సెలెక్ట్ చేసుకోవాలి.
మీరు ఎప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నా సరే, 5 బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే, మీరు ఎక్కడ ఉన్నారో, అ అడ్రెస్ ఎమెర్జెన్సి అనే మెసేజ్ తో ఆ వ్యక్తీ మొబైల్ కి వెళుతుంది.
* నెలకి రూ.153 రూపాయలు చెల్లిస్తే చాలు, అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 4G ఇంటర్నెట్ మీ సొంతం.అయితే ఒక్కరోజుకి 500 MB మాత్రమే హై స్పీడులో వాడుకోవచ్చు.
లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 128 KBPS కి పడిపోతుంది.
* ప్రతి నెల రీచార్జ్ ద్వారా జియో ప్రీమియం యాప్స్ అన్ని మీరు పూర్తి ఉచితంగా పొందవచ్చు.
* మీరు ఈ ఫోన్ ద్వారా టీవి కూడా చూడవచ్చు.ఈ ఫోన్ తో పాటే ఒక కేబుల్ వస్తుంది.
ఆ కేబుల్ ని టీవికి కనెక్ట్ చేసి, మొబైల్ లో మీరు ప్లే చేసే ప్రసారాలను టీవి తెరపై చూడవచ్చు.జియో టీవి యాప్ ద్వారా డిష్ కనెక్షన్ లేకుండానే, ఫోన్ తో టీవి చూడొచ్చు.అయితే ఈ సర్వీసు పొందాలంటే మాత్రం నెలకి రూ.309 ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాలి.
* డిజిటల్ పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.NFC సపోర్ట్ కూడా ఉండటం ఓ అద్భుతం.