నాగార్జునా – దిల్ రాజు లకి ‘జోష్’ సినిమా సమయం నుంచీ మంచి అనుబంధం ఉంది.వీరిద్దరి కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా రాబోతోంది అంటున్నారు.
ఇప్పటికే రవితేజ తో ‘ ఎవడో ఒకడు’ అనే సినిమా తెరకి ఎక్కాల్సిన సమయంలో షూటింగ్ మొత్తం మూట గట్టి అటక ఎక్కించారు ఆ సినిమాని.ఓ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో దిల్ రాజు ఓ సినిమా చేయాలనుకున్నాడు.
రవితేజ తో ఎలా వుంటుంది అనుకున్నారు.అది కుదరలేదు.మన వెబ్సైటు వారికి అందుతున్న సమాచారం ప్రకారం అదే వేణూ శ్రీరాం నిన్నటికి నిన్న నాగార్జున కి ‘ఎవడో ఒకడు’ సినిమా లైన్ కాకుండా వేరే ఒక లైన్ చెప్పాడు అనీ నాగార్జున ఓకే అనేలా ఉన్నారు అనీ తెలుస్తోంది.ఓకె అంటే దిల్ రాజు ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తారు.
నాగార్జున సినిమా అంటే మనంకు ముందు.తరువాత అన్నట్లు వుంది.మనం తరువాత నాగ్ చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నారు.సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలే అందుకు ఉదాహరణ.అయితే ఫిలిం నగర్ లో వస్తున్న వార్తల ప్రకారం ఎవడో ఒకడు సినిమా లైన్ నే నాగార్జున కి చెప్పాడు రాం అంటున్నారు, కాకపోతే కాస్త అటూ ఇటూ చేంజ్ చేసారట.–
.