మీరు వంద మంచి పనులు చేయండి, చేసిన ఒక్క చెడ్డ పనే జనాలకి బాగా గుర్తుండిపోతుంది.బిజినెస్ లోనూ అంతే, ఒక్క బ్యాడ్ ప్రాడక్ట్ కంపెనీ వాల్యూ కిందకి దింపేయగలదు.
ఇప్పుడు టాప్ టెక్నాలజీ బ్రాండ్ శాంసంగ్ విషయంలో అదే జరుగుతోంది.శాంసంగ్ నోట్ 7 మొబైల్స్ పేలుతూ ఉండటం ఆ కంపెనీ ఇమేజ్ ని బాగా దెబ్బతీసింది. ఆ సంస్థ తాజాగా, జులై నుంచి సెప్టెంబరు మాసాలలో వచ్చిన లాభాలను వెల్లడించింది.షాకింగ్ గా, ఆపరేటింగ్ లాభాలు 30% తగ్గాయి.కేవలం 3056 కోట్ల లాభం మాత్రమే వచ్చిందట.ఇక నికర లాభం 17% కిందకి పడిపోయి 3.9 బిలియన్ డాలర్లుగా నిలిచింది
కేవలం మొబైల్స్ వరకే తీసుకుంటే గత ఏడాది శాంసంగ్ 2.4 ట్రిలియన్ల రెవెన్యూ శాంసంగ్ చేతికి అందితే, ఈ ఏడాది కేవలం 100 మిలియన్ల నిర్వహణ లాభాన్ని పొందిందట.నోట్ 7 వైఫల్యం మూలాన, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆరు నెలల్లో శాంసంగ్ నష్టపోతున్న డబ్బు ఎంతో తెలుసా? సుమారు 35,438 కోట్లు అంట.నోళ్ళు వెళ్లబెట్టేసారా !
ఇది శాంసంగ్ పతనానికి మొదలేమో! మనదేశంలో ఇప్పటికి అత్యధిక స్మార్ట్ ఫోన్స్ అమ్ముతున్న సంస్థ శాంసంగే.25% పైగా మార్కెట్ ని ఆక్రమించుకుంది శాంసంగ్.కాని షియోమి రెడ్మీ రాకతో శాంసంగ్ మార్కెట్ మన దేశంలో రాను రాను పడిపోతోంది.
ఇక వరల్డ్ వైడ్ గా నోట్ 7 ఫోన్లు పేలడం శాంసంగ్ ని మరచిపోలేని దెబ్బతీసింది.