‘అత్తారింటికి దారేది’ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్తో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆకాశాన్ని అంటేలా ఉంది.ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం ‘గబ్బర్సింగ్`2’.
ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.పవన్ కళ్యాణ్ ఫుల్ గడ్డంతో ఈ సినిమాలోని కొన్ని సీన్స్లో నటించనున్నాడు.
అందుకోసం గత కొన్ని రోజులుగా గడ్డంతోనే పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు.మొదట ఆ గడ్డం సీన్స్ను తీసి, ఆ తర్వాత ఇతర సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇక ఈ సినిమాకు మెగా అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లో సైతం అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఈ సినిమాకు ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమా రైట్స్ను హోల్ సేల్గా తీసుకునేందుకు ముందుకు వచ్చింది.
ఈ సినిమా రైట్స్ కోసం ఈరోస్ సంస్థ ఏకంగా నిర్మాతకు 72 కోట్ల ఆఫర్ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.థియేటర్ రైట్స్తో పాటు ఆడియో, ఆన్లైన్, శాటిలైట్ రైట్స్కు కలిపి ఈ మొత్తంగా తెలుస్తోంది.
ఇంత భారీ స్థాయిలో విడుదలకు ముందే పవన్ సినిమా బిజినెస్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో శరత్ మారార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.