కెనడాలో విషాదం చోటు చేసుకుంది.ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్ధి అక్కడ మృతి చెందాడు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తేజా రెడ్డి 2018లో చదువు నిమిత్తం కెనడా కు వెళ్లాడు.ఈ క్రమంలో ఆయన బుధవారం ప్రమాదవశాత్తూ మరణించాడు.
తేజా రెడ్డి మరణవార్త విన్న ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.ప్రస్తుతం కెనడా హాస్పిటల్లో మార్చురీలో తేజా రెడ్డి మృతదేహాన్ని ఉంచారు.
అయితే ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడం కోసం స్నేహితులు ఫండ్ రైజింగ్ క్రియేట్ చేశారు.దీనిపై అక్కడి భారతీయులు, స్థానికులు స్పందించడంతో ఇప్పటి వరకు రూ.5 లక్షలు పొగయ్యాయి.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కెనడా ప్రభుత్వంతో సంప్రదించి తేజారెడ్డి మృతదేహాన్ని తరలించేందుకు సాయం చేయాలని కుటుంబసభ్యులు, స్నేహితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.