సాధారణంగా ఇంటిలో అద్దం పగిలితే అశుభం అని అందరు భావిస్తారు.ఎందుకంటే హిందువులలో అద్దం అంటే లక్ష్మి స్థానం అని నమ్ముతారు.
అద్దానికి లక్ష్మీ దేవికి పోలిక రెండిటికీ స్థిరత్వ బుద్ది ఉండదు .అద్దం లో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు.అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఒకచోట నిలిచి ఉండదు.ఐతే ధర్మ శాస్త్రం ప్రకారం అద్దం పగలడం వలన నష్టము అని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవని పండితుల మాట.
అలాగే మరొక కారణం ఏమిటంటే….అద్దం పగిలితే కాలికి గుచ్చుకొనే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా అద్దం ఉపయోగించేప్పుడు హెచ్చరికగా అద్దం పగిలితే అశుభం అని కొందరు పెద్దలు చెప్పి ఉండవచ్చును.