ఠాగూర్ చిత్రంలో చూపించిన హాస్పిటల్ సీన్.ఆ సినిమా చూసిన ఎవ్వరూ మరచిపోలేరు.
వైధ్య వృత్తి ఎంత వ్యాపారం అయిపోయిందో ఆ ఒక్క సీన్ చూస్తే అర్ధం అయిపోతుంది.ఇదిలా ఉంటే ఇలాంటి ఘోరం ఒకటి మల్హర్ మండలం తాడిచర్ల గ్రామంలో చోటు చేసుకుంది.
వైధ్య నిర్లక్షణకు ఒక నిండు గర్భిణి తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయింది…విషయం ఏమిటంటే…మల్హర్ మండలం తాడిచర్ల గ్రామంలో పాలేరైన రమేష్ భార్య అరుణ (23) రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతినెలా గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.ఈ నెల 18న ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అదే ఆస్పత్రిలో చేర్పించగా కవలలున్నట్లు గుర్తించిన వైద్యులు మరుసటిరోజు సిజేరియన్ చేశారు.
కానీ కడుపులోనే ఒక పాప మృతి చెందగా, మరోపాప ఆరోగ్యంగా జన్మించింది.అయితే గురువారం ఉదయం నుంచి కళ్లు, చెవులు పనిచేయట్లేదని అరుణ చెబుతోందంటూ తల్లి పోచమ్మ, భర్త రమేష్ వైద్యుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు.
దీంతో అరుణ శుక్రవారం ఉదయం అపస్మారకస్థితికి చేరుకుని మృతిచెందింది.విషయం తెలుసుకున్న వైద్యులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అరుణ మృతదేహాన్ని ఆపరేషన్ థియేటర్కు తరలించి చికిత్స నాటకం ఆడారు.
ఆ తర్వాత ఆస్పత్రిలోని ఓపీ విభాగం సమయం పూర్తయిన తర్వాత అరుణ చనిపోయిందని భర్త రమేష్కు తెలిపారు.ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని చెప్పి రమేష్ సంతకం తీసుకున్నారు.
విషయం తెలిసిన పోలీసుకు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.