డాక్టర్లు చెప్పటంతో శిశువుని కాల్చబోయారు

పేరుకి డాక్టర్లు కాని, మనిషి ప్రాణం పోయిందో, ఊపిరితో కొట్టుమిట్టాడుతుందో చెప్పలేని పరిస్థితి వారిది.వారి మాటలు నమ్మి కేవలం ఓ వారం వయసు ఉన్న శిశువుని కాటిలో కాల్చబోయారు తల్లిదండ్రులు.

 Doctors Declared Dead – Parents Have Taken Alive Baby To Graveyard-TeluguStop.com

ఈ వింత సంఘటన నిన్న కర్ణాటక, హుబ్లీ జిల్లాలోని దేవికొప్ప గ్రామంలో జరిగింది.

విషయంలోకి వెళితే, దేవికొప్ప గ్రామానికి చెందిన ఫక్కిరప్ప, నేత్రావతి దంపతులకి వారం క్రితం ఓ ఆడపిల్ల సంతానంగా లభించింది.

అయితే శిశువు ఆరోగ్యం సరిగా లేనందున ధార్వాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ చికిత్సం కోసం తీసుకెళ్ళారు.చికిత్స మొదలుపెట్టిన డాక్టర్లు కాసేపటికి శిశువు మృతిచెందిందని నిర్థారించేసరికి ఆ తల్లిదండ్రులకు శోకం మిగిలింది.

విధి మిగిల్చిన విషాదం అని, ఆ చిన్నారిని స్మశానానికి తీసుకెళ్ళారు.అంతక్రియలు మొదలుపెట్టబోతుండగా శిశువులో కదలికలు కనిపించాయి.

ప్రాణం ఉండటంతో వెంటనే హుబ్లీలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.అక్కడి డాక్టర్లు ప్రస్తుతం శిశువుని ఐసియూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు.

చూశారుగా .ఎంత గొప్ప డాక్టర్లు మన దేశంలో తిరుగుతున్నారో!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube