స్టార్ హీరోల సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా మొదటి వారం రోజుల్లో 10 నుండి 15 కోట్లు వసూళ్లు వస్తూ ఉంటాయి.భారీ సంఖ్య థియేటర్లలో సినిమాలను విడుదల చేయడం వల్ల మొదటి వారం పది రోజుల్లోనే బడ్జెట్ను తిరిగి రాబట్టుకునేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే చిన్న హీరోల సినిమాలు సక్సెస్ అయితేనే కలెక్షన్స్ వస్తాయి.కాని నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఏమాత్రం రావడం లేదు.విడుదలైన వారం రోజుల్లో కేవలం 2.5 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది.
భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘దోచేయ్’ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం నివ్వెర పోతున్నారు.యావరేజ్ టాక్ వచ్చినా కూడా క్రేజ్ లేని హీరో కనుక కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయని అంటున్నారు.
చైతూ గత చిత్రం ‘ఒక లైలా కోసం’ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది, కాని కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి.‘దోచేయ్’ సినిమాను నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ 12 కోట్లు పెట్టి నిర్మించినట్లుగా తెలుస్తోంది.సినిమా విడుదలకు ముందే మంచి అంచనాలు రావడంతో టేబుల్ ప్రాఫిట్కు అమ్మాడు.దాంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నిండా మునుగుతున్నారు.పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చే అవకాశాలు లేవని డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు.