తెలంగాణా లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని విపక్షాలు బాగా ఉపయోగించుకుంటున్నారు.తమ డిమాండ్ లని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అతనూ కాంగ్రెస్ లీడర్ లు గొడవ చేస్తున్నారు.
ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ ఏకంగా ధర్నా కి దిగిపోయారు.బెంగళూరు హైవే మీద ఆమె చేసిన ధర్నా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలని ఆపేసింది.
కాస్తంత కూడా వాహనాలు ముందుకు వెళ్ళని పరిస్థితి ఎదురు అయ్యింది ఆ ప్రాంతం.ఓ ప్రజలు భారీగా అరుణ తో కలిసి హై వే మీదకి వచ్చారు.
దాంతో అక్కడ రసాభాస ఎదురు అయ్యింది.మహబూబ్ నగర్ లోని గద్వాలను జిల్లా చేయాలని ఆ ప్రాంతానికి చెందిన నేత అయిన డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు కూడా.
గద్వాల జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు జరిగే మేలుపై ఆమె వివరణాత్మకంగా సీఎం కేసీఆర్ కు ప్రతిపాదనలు కూడా పంపించారట.అయితే… టీఆరెస్ ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు.కొత్త జిల్లాల జాబితాలో గద్వాలకు స్థానం దక్కలేదు.
ఈ సంగతి తెలుసుకున్న అరుణ పోరాటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు.
దాంతో వేలాదిగా అనుచురులతో కదలివచ్చి బెంగళూరు హైవేను దిగ్బంధించారు.
ఎర్రవల్లి చౌరస్తా వద్దకు వచ్చిన ఆమె జాతీయ రహదారిపై బైఠాయించడంతో తవర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.