డీకే అరుణ దెబ్బ .. ఆగిపోయిన హై వే ట్రాఫిక్

తెలంగాణా లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని విపక్షాలు బాగా ఉపయోగించుకుంటున్నారు.తమ డిమాండ్ లని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అతనూ కాంగ్రెస్ లీడర్ లు గొడవ చేస్తున్నారు.

 Dk Aruna Creates Traffic On Banglore Highway-TeluguStop.com

ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ ఏకంగా ధర్నా కి దిగిపోయారు.బెంగళూరు హైవే మీద ఆమె చేసిన ధర్నా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలని ఆపేసింది.

కాస్తంత కూడా వాహనాలు ముందుకు వెళ్ళని పరిస్థితి ఎదురు అయ్యింది ఆ ప్రాంతం.ఓ ప్రజలు భారీగా అరుణ తో కలిసి హై వే మీదకి వచ్చారు.

దాంతో అక్కడ రసాభాస ఎదురు అయ్యింది.మహబూబ్ నగర్ లోని గద్వాలను జిల్లా చేయాలని ఆ ప్రాంతానికి చెందిన నేత అయిన డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు కూడా.

గద్వాల జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు జరిగే మేలుపై ఆమె వివరణాత్మకంగా సీఎం కేసీఆర్ కు ప్రతిపాదనలు కూడా పంపించారట.అయితే… టీఆరెస్ ప్రభుత్వం అదేమీ పట్టించుకోలేదు.కొత్త జిల్లాల జాబితాలో గద్వాలకు స్థానం దక్కలేదు.

ఈ సంగతి తెలుసుకున్న అరుణ పోరాటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు.

దాంతో వేలాదిగా అనుచురులతో కదలివచ్చి బెంగళూరు హైవేను దిగ్బంధించారు.

ఎర్రవల్లి చౌరస్తా వద్దకు వచ్చిన ఆమె జాతీయ రహదారిపై బైఠాయించడంతో తవర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube