తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘లింగ’.ఈ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
నాలుగు సంవత్సరాల తర్వాత రజినీ హీరోగా నటించిన చిత్రం కావడంతో పాటు, హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా వచ్చాయి.అందుకు తగ్గట్లుగానే ఈ చిత్ర నిర్మాత దాదాపుగా 200 కోట్ల బిజినెస్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.అన్ని ఏరియాలకు రికార్డు స్థాయిలో పంపిణీ హక్కులు అమ్ముడు పోయాయి.
200 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం 100 కోట్లు కూడా రాబట్టలేక పోయింది.దాంతో డిస్ట్రిబ్యూటర్లు పీకల్లోతు కష్టాల్లో మునిగి పోయారు.10 నుండి 15 కోట్లు పెట్టి కొన్న ఏరియాల్లో కేవలం కోటి నుండి 1.5 కోట్లు మాత్రమే రావడంతో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతను ఆశ్రయించే ప్రయత్నం చేశారు.కాని నిర్మాత అందుబాటులోకి రాకపోవడంతో రజినీతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నా డిస్ట్రిబ్యూటర్లు.
రజినీతో మాట్లాడేందుకు వెళ్తున్న తమకు భద్రత కల్పించాల్సిందిగా చెన్నై కమీషనర్ను డిస్ట్రిబ్యూటర్లు కోరారు.రజినీ వద్దకు వెళ్తే తమపై ఆయన ఫ్యాన్స్ దాడికి దిగే అవకాశాలున్నాయని, అందుకే తమకు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరడం జరిగింది.
అందుకు పోలీసులు కూడా అంగీకారం తెలిపి డిస్ట్రిబ్యూటర్లకు భద్రత కల్పించేందుకు ఓకే చెప్పారు.మరి రజినీకాంత్ డిస్ట్రిబ్యూటర్లకు ఏం చెబుతాడనేది ఆసక్తికర విషయంగా ఉంది.