పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన సంగతి తెలిసిందే.మొదటి ఆట నుంచే నెగేటివ్ టాక్ మూటగట్టుకున్న సర్దార్ భారి డిజాస్టర్ గా నిలిస్తే, యావరేజ్ టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు ఫ్లాప్ గా నిలించింది.
రెండు సినిమాల మీద డబ్బులు పెట్టిన బయ్యర్లకు ఎలాంటి నష్టపరిహారం దక్కలేదు.ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ పంపిణీదారులు ప్రెస్ మీట్ పెట్టినా, రోడ్డు మీద ధర్నాలు చేసినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు.
వారి బాధ ఏమిటంటే, నష్టపరిహారం ఇస్తానని మాటిచ్చి పవన్ కళ్యాణ్ వారిని గాలికి వదిలేసాడట.
అలాంటి పరిస్థితి తమకు రాకూడదని ముందు జాగ్రత్తలు ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్.
ఈస్ట్ ఏరియాకి చెందిన ఓ బయ్యర్ బాండ్ పేపర్ మీద నష్టపరిహారం గురించి మాటిచ్చి పవన్ కళ్యాణ్ సంతకం పెడితే తప్ప డబ్బులు చెల్లించను అంటున్నాడట.అసలే త్రివిక్రమ్ తో అత్తారింటికి దారేది తరువాత వస్తున్న సినిమా కావడంతో రేట్లు ఎక్కువ చెబుతున్నారు.
తేడాకొడితే మునుపటికంటే దారుణంగా తయారవుతుంది బయ్యర్ల పరిస్థితి.అందుకే నష్టపరిహారం మీద పవన్ లీగల్ గా మాటిస్తే తప్ప డీల్ వద్దని మొండికేస్తున్నాడట ఈ డిస్ట్రిబ్యూటర్.
మరి డిమాండ్ కి తలొగ్గి పవర్ స్టార్ సంతకం పెడతాడో, లేదంటే వేరే పంపిణిదారులని చూసుకుంటాడో చూడాలి.ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మానుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ప్రస్తుతానికైతే అక్టోబరు రెండొవ వారంలో ఈ సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.