పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది ఉత్తరాది అందం దిశా పటాని.సినిమాల్లోకి రాకముందే ఈ అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్ లతో బాగా ఫేమస్ అయ్యింది.
దానికితొడు దిశా బాలివుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కి గర్ల్ ఫ్రెండ్ అనే పూకార్లు కూడా ఉండటంతో ఎప్పుడూ నలుగురి నోళ్లలో నానింది దిశా.
లోఫర్ అపజయాన్ని మూటగట్టుకున్నా, దిశా అందచందాలకు మంచి మార్కులే పడ్డాయి.
తెలుగు దర్శకనిర్మాతలు పట్టించుకోకున్నా, ఈ భామకి బాలివుడ్ నుంచి తీపి కబురు అందింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకుడి.ఇంతకుముందు నీరజ్ తీసిన చిత్రాలు బేబి, స్పెషల్ ఛబ్బీస్ మంచి విజయాలు సాధించడంతో ఈ చిత్రంపైన భారి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇందులో ధోని గర్ల్ ఫ్రెండ్ పాత్రకోసం దిశా పటాని పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం.ఇదే నిజమైతే అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే.