ఒకప్పుడు హీరోయన్ల బట్టల సైజు సినిమాల్లో మాత్రమే తగ్గేది.బయట మాత్రం సింపుల్ గానే ఉండేవారు.
కాని ఇప్పుడు అలా కాదు, సినిమాల్లో కన్నా బయటే ఎక్కువ గ్లామరస్ గా ఉంటున్నారు సినీ ముద్దుగుమ్మలు.ఫ్యాషన్ ట్రెండ్స్ ఎక్కువ అయిపోవడంతో, హీరోయిన్లంతా డిజైనర్స్ ని నియమించుకుంటున్నారు.
ఇక ఆ డిజైనర్స్ బట్టల సైజు దారుణంగా తగ్గించేస్తున్నారు.ఏ ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, గ్లామరస్ గా వెళ్ళాల్సిందే.
ఇక తాజాగా దిశా పటాని ఓ బాలివుడ్ అవార్డు ఫంక్షన్ లో హల్ చల్ చేసింది.ఓవర్ ఎక్స్పోజింగ్ తో జనాల చూపుల్ని డిస్టర్బ్ చేసింది.ఫంక్షన్ మొత్తంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ తనే.కాని తిట్టుకున్నవారు తిట్టుకున్నారు కూడా.ఏదో హాట్ ఫోటోషూట్ లో పాల్గొన్నట్లు మరీ ఇంత గ్లామరస్ గా ఒక అవార్డు ఫంక్షన్ కి రావడం అవసరమా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.
కాని యువత మాత్రం దిశా ఫ్యాషన్ సెన్స్ కి ఫిదా అయిపోతోంది.
అసలే ఈ అమ్మడుకి ఉన్న గ్లామర్ ఇమేజ్ అలాంటిది, ఇలాంటిది కాదు.చెప్పాలంటే హిందీ యువత కలలరాణిగా మారింది.
మొన్న వాలెంటైన్స్ డేకి ఓ కాలేజీలో దిశాకి ఏకంగా పూజలు నిర్వహించారు కుర్రాళ్ళు.సినిమాలు ఎక్కువ చేయకపోయినా, ఇంత క్రేజు రాబట్టుకుందంటే, అదంతా తన గ్లామర్ షో తోనే.
అందుకే గ్లామర్ ప్రపంచంలో చూపులు తమ వైపు చూపులు ఎలా తిప్పుకొవాలో దిశాకి తెలిసినంత బాగా మరో హీరోయిన్ కి తెలియదని అంటున్నారు బాలివుడ్ జనాలు.