క్షమాపణలు చెప్పిన జక్కన్న

ప్రభాస్‌ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’.ఈ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులు దాదాపుగా రెండు సంవత్సరాల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Rajamouli Says Sorry To Fans-TeluguStop.com

రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్‌ను జులై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఆడియోను మే 31న అత్యంత భారీగా కార్యక్రమం నిర్వహించి విడుదల చేయాలని జక్కన్న ప్లాన్‌ చేశాడు.

ఆడియో విడుదల కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.మరో రెండు రోజుల్లో ఆడియో మరియు ట్రైలర్‌ విడుదల కానుందని అంతా ఆతృతగా ఉన్న సమయంలో వాయిదా ప్రకటన అందరిలో అసహనం కలిగించింది.

ఇప్పటికే పలు సార్లు సినిమా విడుదల వాయిదా వేశారు.తీరా ఇప్పుడు ఆడియోను చివరి నిమిషంలో వాయిదా వేశారు అంటూ ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

దాంతో జక్కన్న నేరుగా రంగంలోకి దిగాడు.నేడు ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి మరీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వాయిదాపై స్పందించాడు.

చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ క్షమించాలని, ఆడియోను భారీగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో కష్టపడుతున్నాం అని, అయితే గతంలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతులను ఇవ్వడం లేదు అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు.అయినా కూడా వచ్చే ఫ్యాన్స్‌ కోసం సరిపడా ఏర్పాట్లు చేసి, పోలీసుల అనుమతి తీసుకుంటాం అని జక్కన్న ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు.

ఇక ఈ ప్రెస్‌మీట్‌లో ప్రభాస్‌ కూడా పాల్గొన్నాడు.ప్రేక్షకులు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.

అయితే సినిమా చూసిన తర్వాత ఆ ఎదురు చూపులను మరిచి పోతారు అని పేర్కొన్నాడు.ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంపై రెండు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube