‘బాహుబలి’ సినిమాను రాజమౌళి మొదట ఒక్క పార్ట్గానే తెరకెక్కించాలని మొదలు పెట్టాడు.అయితే భారీ బడ్జెట్ అవ్వడంతో పాటు, కథ పెద్దగా ఉండటంతో రెండు పార్ట్లుగా విభజించాడు.
జక్కన్న ప్లాన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.మొదటి పార్ట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ప్రేక్షకులు రెండవ పార్ట్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు ‘బాహుబలి’ దారిలోనే గుణశేఖర్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’.ఈ సినిమాను కూడా మొదట ఒక్క పార్ట్గానే తెరకెక్కించాలని భావించాడు.
కాని బడ్జెట్ రీత్యా రెండు పార్ట్లుగా చేయాలనుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది.
‘రుద్రమదేవి’ సినిమా రెండవ భాగంకు ‘ప్రతాపరుద్రుడు’ అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించాడని, మొదటి పార్ట్లో కథను కాస్త అసంపూర్తిగా ఉంచి, రెండవ పార్ట్ను కొనసాగించాలని గుణశేఖర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రుద్రమదేవి తనయుడు, చివరి కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మొదటి పార్ట్ విడుదలైన కొన్నాళ్లకు రెండవ పార్ట్ ‘ప్రతాపరుద్రుడు’ను ప్రారంభించే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇక ‘ప్రతాపరుద్రుడు’ పాత్రకు అల్లు అర్జున్తో పాటు పలువురు స్టార్ హీరోలను పరిశీలిస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది.